న్యూఢిల్లీ: క్యాబ్రైడ్ బుక్ చేయడానికి ముందే టిప్పింగ్(అదనపు మొత్తం) చెల్లించే అవకాశాన్ని చూపించడాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతోపాటు అన్యాయమైనదిగా ఉందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే బుధవారం తెలిపారు.
రైడ్ పూర్తయిన తర్వాతే వినియోగదారుడి నిర్ణయం మేరకే టిప్పింగ్ ఉండాలని, ముందుగా టిప్ చెల్లించేలా ఒత్తిడి చేయకూడదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర వినియోగదారుల పరిక్షణ అథారిటీ(సీసీపీఏ) అన్యాయ వాణిజ్య పద్ధతులకు పాల్పడినందుకు ర్యాపిడోపై రూ. 10 లక్షల జరిమానా విధించిన మరుసటి రోజే నిధి ఖరే ఈ వ్యాఖ్యలు చేశారు.