దేశంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొత్తం 16 రాష్ట్రాల్లో 269 కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలకు తాజాగా కొన్ని సూచనలు చేసింది. పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు సంసిద్ధమైపోవాలని స్పష్టం చేసింది. జిల్లాలు, పాజిటివ్ కేసులు, క్లస్టర్లపై కచ్చితంగా ఓ నిఘా వేసి ఉంచాల్సిందేనని స్పష్టం చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూనే, అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని కూడా కేంద్రం సూచించింది. ఇంటింటికీ వెళ్లి టీకాలు ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని, స్థానికంగా ఉండే పంగల విషయంలో ఆంక్షలు కూడా విధించాలని కేంద్రం పేర్కొంది. వీటితో పాటు మరికొన్ని కీలక సూచనలు కూడా కేంద్రం చేసింది.