న్యూఢిల్లీ: సంప్రదాయ పోలీస్ విధుల్లో మహిళా సిబ్బందిని భాగం చేసేందుకు ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీస్ విభాగం ‘ప్రశక్తి’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ శుక్రవారం దీనిని ప్రారంభించారు. ఇందులో భాగంగా అన్ని పోలీసు స్టేషన్లలో ప్రశక్తి బీట్స్, వీర స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో మహిళా పోలీసులతో ఏర్పాటు చేసి తొలి ‘పింక్ బూత్’ అని ఆమె అన్నారు.
అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక ప్రశక్తి బీట్ను ఏర్పాటు చేస్తామని శ్వేతా చౌహాన్ చెప్పారు. చురుకైన పెట్రోలింగ్, పింక్ బూత్లో విధుల నిర్వహణకు మహిళా పోలీసులతో కూడిన ‘వీర స్క్వాడ్’ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయవచ్చని, తమ ఆందోళనను మహిళా పోలీస్ సిబ్బందితో స్వేచ్ఛగా పంచుకోవచ్చని ఆమె తెలిపారు.