న్యూఢిల్లీ : సీబీఎస్ఈ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి కోడింగ్, డేటా సైన్స్ సబ్జెక్ట్లు తమ పాఠ్యాంశంలో భాగం కానున్నాయి. దీని కోసం మైక్రోసాఫ్ట్ సంస్థతో డీల్ కుదుర్చుకున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు, కంప్యూటర్ నైపుణ్యాన్ని పెంచేందుకు, ప్రాబ్లమ్ సాల్వింగ్ సిల్క్స్ను డెవలప్ చేసేందుకు ఈ కొత్త పాఠ్యాంశాలు ఉపయోగపడనున్నాయి. 2020 నూతన జాతీయ విద్యా విధానాన్ని దృష్టిలో పెట్టుకుని కోడింగ్, డేటా సైన్స్ పాఠాలను విద్యా ప్రణాళికలో చేర్చారు. ఆరు నుంచి ఎనిమిదో తరగలి సీబీఎస్ఈ విద్యార్థలకు కోడింగ్, ఎనిమిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు డేటా సైన్స్ సబ్జెక్టులు ఉంటాయని సీబీఎస్ఈ బోర్డు చైర్మన్ మనోజ్ అహుజా తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్ని కోడింగ్, డేటా సైన్స్ కోర్సులను మైక్రోసాఫ్ట్ సహకారంతో డెవలప్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కొత్త పాఠాలు విద్యార్థుల్లో మనో ధైర్యాన్ని కల్పిస్తాయని, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్ నైపుణ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. కోడింగ్, డేటా సైన్స్ సబ్జెక్ట్లకు సంబంధించిన పుస్తకాలను మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసింది. అయితే ఎన్సీఈఆర్టీ నమోనాకు తగినట్లు ఆ పుస్తకాలు ఉండనున్నాయి.