జైపూర్: రాజస్థాన్ రెవెన్యూ మంత్రి రామ్లాల్ జాట్, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రానైట్ గనిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాక, అక్కడి నుంచి మెషినరీని అపహరించారన్న ఆరోపణలపై కోర్టు ఆదేశాల కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గని స్వాధీనంపై పరమేశ్వర్ జోషి అనే వ్యక్తి భిల్వారా జిల్లాలో స్థానిక కోర్టును ఆశ్రయించారు. అయినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కరేడా పోలీస్ స్టేషన్లో మంత్రి రామ్లాల్ జాట్, మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అసింద్ డీఎస్పీ యోగేష్ శర్మ తెలిపారు.