న్యూఢిల్లీ: ఖలిస్థాన్ తీవ్రవాది, కెనడా జాతీయుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరిస్తుందని ప్రధాని మోదీ నుంచి కెనడా ప్రధాని కార్నీ వాగ్దానం తీసుకున్నారని, ఆ తర్వాతే ఆయనకు జీ7 సదస్సుకు ఆహ్వానం పంపినట్టు కెనడా పత్రిక టొరెంటో స్టార్ వెల్లడించింది.
ఇద్దరు ప్రధాన మంత్రుల మధ్య జరిగిన సంభాషణల తర్వాత ఈ వాగ్దానం జరిగినట్లు తెలిపింది. దర్యాప్తు సంస్థల మధ్య చర్చ కొనసాగింపునకు భారత ప్రధాని అంగీకరించారని కార్నీని ఉటంకిస్తూ పత్రిక పేర్కొంది.