న్యూఢిల్లీ: బైజూస్(Byju’s) వ్యవస్థాపకుడు రవీంద్రన్కు ఆరు నెలల జైలుశిక్ష పడింది. సింగపూర్ కోర్టు ఆ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఆస్తులకు చెందిన వివరాలను వెల్లడించేందుకు రవీంద్రన్ విస్మరించిన కేసులో సింగపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2024 ఏప్రిల్లో ఆ కేసు నమోదు అయ్యింది. అయితే అధికారుల ముందు లొంగిపోవాలని బైజూస్ వ్యవస్థాపకుడికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుమారు 90 వేల డాలర్లు కూడా చెల్లించాలని సింగపూర్ కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. బీయర్ ఇన్వెస్ట్కో పీటీ సంస్థ ఓనర్షిప్కు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాలని కూడా కోర్టు పేర్కొన్నది.
విదేశీ పెట్టుబడిదారుల నుంచి ఇప్పటికే బైజూస్ సంస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. విదేశీయుల నుంచి సుమారు 1.2 బిలియన్ల డాలర్ల రుణం తీసుకున్నట్లు బైజూస్పై ఆరోపణలు ఉన్నాయి. అయితే సింగపూర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రవీంద్రన్ ఇంకా స్పందించలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో స్పష్టంగా తెలియదు.
ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ థింక్ అండ్ లెర్న్ను ఆయన స్థాపించారు. అదే బైజూస్ సంస్థగా ఫేమస్ అయ్యింది. ఆ సంస్థ ఏర్పాటు తర్వాత ఆయన బిలియనీర్ అయ్యారు. ఇండియన్ స్టార్టప్ రంగంలో అసాధారణ విజయం సాధించిన వ్యక్తిగా నిలిచారు. దీంతో కొన్ని విదేశీ కంపెనీలు ఆయన సంస్థలో పెట్టుబడి పెట్టాయి. అయితే సింగపూర్ కోర్టు బైజూస్ కంపెనీపై ఫోకస్ పెట్టింది. కోర్టు ధిక్కరణ కేసులో అతనికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది.