లక్నో: యూపీలోని బస్తీ జిల్లా చిల్వానియా గ్రామంలోలో ఓ నిరుపేద మహిళ ఇంటిని ఈ నెల 3న బుల్డోజర్తో కూల్చి..వారి స్థలాన్ని ఓ బీజేపీ నాయకుడు ఆక్రమించే ప్రయత్నం చేశాడు. అయితే అదే బుల్డోజర్తో జిల్లా ఉన్నతాధికారులు నిందితుడికి తగిన గుణపాఠం చెప్పారు. బాధితురాలు నిర్మలా దేవి గ్రామంలో లేని సమయంలో ఆమె ఇంటిని బీజేపీ నాయకుడు ఇంద్రకుమార్ బుల్డోజర్తో కూల్చి ఆ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు జిల్లా కలెక్టర్ను కలుసుకొని గోడు వెళ్లబోసుకోగా అధికారులు విచారణ చేసి నిందితుడి ఇంటిని బుల్డోజర్తో కూల్చేశారు.