బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన కృషి మేళాలో సుమారు కోటి విలువ చేసే మూడున్నర ఏండ్ల కృష్ణ అనే ఎద్దు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హల్లికర్ జాతి అన్ని పశువులకు తల్లి అని యజమాని బోరగౌడ తెలిపారు. ఈ జాతి ఎద్దు వీర్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. డోసు వీర్యాన్ని వెయ్యికి విక్రయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు బెంగళూరులో ఈ నెల 11న ప్రారంభమైన కృషి మేళా ఆదివారం ముగిసింది. నాలుగు రోజులపాటు ప్రత్యక్షంగాను, ఆన్లైన్లోనూ దీనిని నిర్వహించారు. వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలను కర్ణాటక రైతులు, వ్యవసాయ అనుబంధ సంస్థలు ప్రదర్శించాయి.