న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో సోమవారం నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. భవనంలో పలువురు చిక్కుకున్నట్లుగా తెలుస్తున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సత్య నికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలినట్లుగా సమాచారం అందిందని, ఆ తర్వాత ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. భవనం శిథిలాల కింద ఐదుగురు కార్మికులు చిక్కుకున్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొంది. అయితే, భవనం కూలగడానికి గల కారణాలు తెలియరాలేదు.