డెహ్రాడూన్: భారీ వర్షాలు, వరదల వల్ల ఒక బిల్డింగ్ కూలింది. పలు ఇల్లులు నీట మునిగాయి. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. పిథోరగఢ్, ధార్చుల పట్టణంలో భారీగా నష్టం వాటిల్లింది. భారీ వరదలకు కాలి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. వరదలకు నది తీరం కోతకు గురైంది. దీంతో అంచులో ఉన్న ఒక బిల్డింగ్ కూలింది. ఖోటిల గ్రామంలో 50కిపైగా ఇల్లులు నీట మునిగాయి.
కాగా, ఉత్తరాఖండ్ పోలీస్, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమయ్యాయి. కాలి నది ఉధృతంగా ప్రవహించడంతోపాటు ప్రమాదకర స్థితికి చేరడంపై ప్రజలను హెచ్చరించారు. ఆ నదిపై ఉన్న అన్ని వంతెనల మీదుగా రాకపోకలు సాగించవద్దని సూచించారు. భారీ వరదలకు నది తీరం అంచున ఉన్న ఒక బిల్డింగ్ కూలిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. ప్రజలు, పర్యాటకులు సురక్షితంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
दिनांक 9 अगस्त 2022 की मध्य रात्रि में नेपाल से आते हुए नाले में बादल फटने से कस्बा धारचूला जिला पिथौरागढ़ के खोतिला गांव में आपदा आई हुई है, फायर सर्विस, Sdrf, पुलिस एवं प्रशासन द्वारा रेस्क्यू कार्य लगातार चल रहा है।#Pithoragarh #Uttarakhand pic.twitter.com/uMz4LUBnqL
— Fire Service Uttarakhand Police (@UKFireServices) September 10, 2022