లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి.. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం మాయావతితో పాటు తాను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. యూపీలో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో సమాజ్వాదీ కానీ, బీజేపీ కానీ గెలవబోదన్నారు. సమాజ్వాదీ పార్టీ వద్ద 400 మంది అభ్యర్థులు లేరని, అలాంటప్పుడు వాళ్లు ఎలా 400 సీట్లు గెలుస్తారని ఎంపీ సతీశ్ చంద్ర ప్రశ్నించారు. ఎస్పీ లేదా బీజేపీ అధికారంలోకి రాదు అని, యూపీలో బీఎస్పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎంపీ సతీశ్ తెలిపారు.