Uttar Pradesh | లక్నో, మార్చి 18: కేవలం ప్రభుత్వ పథకం ద్వారా లబ్ది పొందాలన్న దురుద్దేశంతో అప్పటికే పెళ్లయిన సోదరిని అందరి ముందు ఆమె సోదరుడు వివాహమాడాడు. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సామూహి క వివాహ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింద పెళ్లాడిన జంటకు గృహోపకరణాలతోపాటు 35 వేల నగదును అందిస్తారు. మహారాజ్ గంజ్ జిల్లాలో ఓ వి వాహితను మరోసారి పెళ్లి చేసుకోవటానికి కొంత మంది ఒప్పించారు. అయితే ము హూర్త సమయానికి వాళ్లు మాట్లాడుకున్న వరుడు రాలేదు. దీంతో ఆ వివాహిత సోదరుడితో ఆమె వివాహం జరిపించారు.