న్యూఢిల్లీ : మహిళా రెజర్లను లైంగింకంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై తాజాగా అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణకు ఆదేశించింది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది.
కైసర్గంజ్ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ యూపీలోని గోండ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో, గాగ్రా, సరయు నదీ తీరాల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని దాఖలైన పిటిషన్పై ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. రోజూ 700కు పైగా ఓవర్ లోడ్ ట్రక్కుల ద్వారా ఖనిజాలను బ్రిజ్ భూషణ్ అక్రమంగా రవాణా, నిల్వ, విక్రయం చేస్తున్నారని పిటిషన్ ఆరోపించారు. దీనివల్ల పత్పర్ గంజ్ వంతెన, రోడ్డు దెబ్బ తింటున్నాయని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్భూషణ్ ఖండించారు.