జౌన్పూర్: ఉత్తరప్రదేశ్లో ఓ వధువు(Bride) తన పెళ్లికి ఒక రోజు ముందే ఇంటి నుంచి పరారీ(run away) అయ్యింది. ఆ అమ్మాయి ఎందుకు వెళ్లిందో, ఎక్కడికి వెళ్లిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే.. జౌనుపూర్కు చెందిన ఓ అమ్మాయికి మీర్జాపూర్కు చెందిన యువకుడితో పెళ్లి ఫిక్సైంది. అయితే కొన్ని పెళ్లి తంతులు కూడా జరిగాయి. కానీ పెళ్లికి ఒక్క రోజు ముందే ఆ వధువు ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయింది. పెళ్లి కూతురు మిస్సైనట్లు తెలుసుకున్న ఫ్యామిలీ సభ్యులు హైరానాలో పడిపోయారు. ఆమె కోసం ఊరంతా వెతికారు. చివరకు ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.
ఇక ఈ లోపు మరో సంఘటన జరిగింది. పెళ్లి కూతురు పారిపోవడంతో.. వరుడికి మరో అమ్మాయితో పెళ్లి చేయాలని వధువు బంధువులు ఫిక్స్ అయ్యారు. వాళ్లు చేసిన ప్రపోజల్కు వరుడి బంధువులు కూడా ఓకే చెప్పేశారు. ఆ వెడ్డింగ్ను గ్రాండ్గా నిర్వహించారు. ఆ పెళ్లి ముగిసాక పారిపోయిన అమ్మాయి ఆచూకీ పోలీసులకు చిక్కింది. ఊళ్లో ఉన్న ఓ ప్రైమరీ స్కూల్లోనే ఆమె తలదాచుకున్నది.
ఆ అమ్మాయిని విచారించిన పోలీసులు ఆసక్తికర విషయాన్ని తెలుసుకున్నారు. ఎందుకు పారిపోయావని అడగ్గా.. యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేరవ్వాలనుకున్నానని, కానీ కుటుంభసభ్యులు మాత్రం తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నట్లు ఆ అమ్మాయి పేర్కొన్నది. ఐఏఎస్కు ప్రిపేర్ కావాలని తన తల్లికి గతంలోనే చెప్పినట్లు ఆమె గుర్తు చేసింది. కానీ తన భవిష్యత్తును కాదని, వాళ్లు బలవంతంగా పెళ్లి చేస్తున్నట్లు ఆమె ఆరోపించింది.
పారిపోయేందుకు ఎవరూ సలహా ఇవ్వలేదని, స్వయంగానే ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆ అమ్మాయి చెప్పింది. అయితే పెళ్లి పిల్ల తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వివిధ కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నారు.