కోల్కతా: విద్యా వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్భవన్ పెత్తనాన్ని సహించమని బెంగాల్ విద్యా శాఖ మంత్రి బ్రత్య బసు స్పష్టం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గవర్నర్ ఆనంద్ రాష్ట్రంలోని యూనివర్సిటీలను సందర్శించడంపై శుక్రవారం పైవిధంగా స్పందించారు. గవర్నర్ పర్యటనను ఉద్దేశించి ఆయన ‘తెల్ల ఏనుగు కదులుతున్నది’ అంటూ విమర్శించారు.
బెంగాల్, గవర్నర్ మధ్య ఉన్న విభేదాలు ఈ సంఘటనతో మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రభుత్వం, గవర్నర్ ఇప్పటికే కలిసి నిర్ణయించుకున్నాయని అయితే దానికి విరుద్ధంగా గవర్నర్ చర్య ఉన్నదని మండిపడ్డారు.