భోపాల్ : మధ్యప్రదేశ్లోని జైన్ ఆలయంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బాలుడి చేతులను తాళ్లతో కట్టి ఆపై చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలుడిని నిర్భందించి, వేధించినందుకు నిందితుడు రాకేష్ జైన్పై ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
సాగర్ నగరంలోని సిద్ధయతన్ జైన్ ఆలయంలో ఈ ఘటన జరిగింది. బాలుడిని ఇద్దరు వ్యక్తులు చెట్టుకు కట్టేసి హింసిస్తుండటంతో బాలుడు సాయం కోసం అరస్తుండటం వీడియోలో కనిపించింది. ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చి వారించగా నిందితులు బెదిరించడంతో వారు వెనుతిరిగారు.
ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం మోతినగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. బాలుడు ఆలయ గేటు వద్ద ఉండగా రాకేష్ అతడిని తన నిర్బంధంలోకి తీసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.