Lalu Prasad Yadav | పాట్నా, ఏప్రిల్ 9: బీహార్లో ఈసారి లోక్సభ ఎన్నికలలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలిద్దరూ పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ మంగళవారం 22 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. లాలూ కుమార్తెలు మీసా భారతి, రోహిణీ ఆచార్యలు వరుసగా పాటలీపుత్ర, శరన్ నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న భారతి పాటలీపుత్ర నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు.