ముంబై : యవ్వన దశలో ఉన్న వారు ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధంలో పాల్గొనేందుకు అనేక దేశాలు సమ్మతి వయస్సును తగ్గించాయని బాంబే హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో ప్రపంచదేశాల్లో జరుగుతున్న మార్పులను మన దేశం, పార్లమెంట్ కూడా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని హైకోర్టు అభిప్రాయపడింది.
కౌమార దశలో ఉన్న ఇద్దరు పరస్పర అంగీకారంతో ఒక్కటవుతున్నప్పటికీ లైంగిక నేరంగా భావించి యువకులపై పోక్సో కేసులు దాఖలు కావడాన్ని జస్టిస్ భారతి దాంగ్రే ప్రస్తావించారు.