న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) లోక్సభకు అనర్హత వేటు (Disqualification) వేయడంపై విమర్శల పరంపర కొనసాగుతున్నది. రాహూల్ను అనర్హుడిగా ప్రకటించడం పట్ల బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhasker) ఆగ్రహం వ్యక్తంచేశారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో (Malegaon blast) ప్రధాన నిందితురాలిగా ఉన్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ (Pragya Thakur) ఇప్పటికీ ఎంపీగా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య (Democracy) తల్లి తన సొంత బిడ్డను చంపేస్తున్నదని పేర్కొటూ ట్వీట్ చేశారు.
Hello World! Mother of Democracy is killing her own child. 🙏🏽🙏🏽🙏🏽 #G20 #NewIndia
— Swara Bhasker (@ReallySwara) March 24, 2023
అచ్ఛే దిన్ (Achhe din) అంటే ఒక ఉగ్రవాద నిందితురాలు దహనం, హింసను ప్రేరేపించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ప్రత్యపక్ష నాయకుడు పార్లమెంటుకు అనర్హుడయ్యాడని గతంలో రష్యా, టర్కీ నుంచి వార్తలు వచ్చాయి. ఇప్పుడు భారత దేశంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, దాని వ్యవస్థలు కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా మారిందని పేర్కొన్నారు.
इनकी लोकसभा की सदस्यता बरकरार है!
अच्छे दिनों में आतंक आरोपियों को आगज़नी और हिंसा भड़काने की पूरी छूट है। वाह री न्यायतंत्र। 🙏🏽🙏🏽🙏🏽
सच कहा है.. नंग बड़े परमेश्वर से!!! https://t.co/o6I0LvW4pt— Swara Bhasker (@ReallySwara) March 24, 2023
2019 నాటి పరువు నష్టం కేసులో గుజరాత్లోని సూరత్ కోర్టు రాహుల్కు రెండేండ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో లోక్సభ సచివాలయం రాహుల్పై అనర్హత వేటువేస్తూ నిర్ణయం తీసుకున్నది. ‘కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని కోర్టు దోషిగా ప్రకటించింది. తీర్పు చెప్పిన తేదీ (23 మార్చి, 2023) నుంచి ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దుచేస్తున్నాం’ అని లోక్సభ సచివాలయం నోటిఫికేషన్లో పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8 ప్రకారం.. ఆర్టికల్ 102(1)(ఈ)లోని నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెక్రటేరియట్ వెల్లడించింది.
एक वक़्त में ऐसी खबरें अंतरराष्ट्रीय अख़बारों में russia, turkey etc . के बारे में पढ़ने को मिलती थी। आज भारत उन देशों में शामिल है जहां लोकतांत्रिक तरीक़े से चुनी गई सरकार और उनकी सरकारी व्यवस्था ख़ुद लोकतंत्र बर्बाद कर रही है। #RahulGandhi https://t.co/j1fL0Tvi8i
— Swara Bhasker (@ReallySwara) March 24, 2023
2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో రాహుల్ మాట్లాడుతూ.. ‘దొంగలంతా మోదీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు?’ అని అన్నారు. ఈ మేరకు నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అంటూ పలు పేర్లను ఉదహరించారు. దీనిపై సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్పై పరువు నష్టం కేసు వేయగా, గురువారం సూరత్ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. కానీ, రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారని కోర్టు నిర్ధారించి, ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం.. దోషిగా తేల్చింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. ఇంతలో రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని సచివాలయం రద్దుచేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(ఈ) నిబంధన ప్రకారం రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. జైలు శిక్షాకాలంతోపాటు మరో ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకూ అనర్హులవుతారు. సెక్షన్ 8లో పేర్కొన్న నేరాలకు ఈ అనర్హత వేటు వర్తిస్తుంది.