లుథియానా : పంజాబ్లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్లో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్స్ రెండో అంతస్తులోని బాత్రూమ్లో మధ్యాహ్నం 12:22 గంటలకు పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. బాత్రూమ్ గోడ పూర్తిగా ధ్వంసమైంది. సమీప గదులకు ఉన్న అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కోర్టు ఆవరణలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.