Shillong : మేఘాలయాలోని షిల్లాంగ్లో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఆదివారం సాయంత్రం 6ః15 నిమిషాల ప్రాంతంలో పోలీస్ బజార్లో ఈ పేలుడు సంభవించిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ పేలుడు తక్కువ మోతాదులోనే జరిగిందంటున్నారు. ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే మొబైల్ ఫోన్స్ షాప్, వైన్ షాప్ ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. మరోవైపు బాంబ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలికి చేరుకున్నాయి. అధికారులు దర్యాప్తును ప్రారంభిస్తున్నారు.