బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది. హుబలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ ఆరోపించింది. కర్నాటక సార్వభౌమత్వం గురించి సోనియా కామెంట్ చేశారని, ఆ విషయంలో చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈసీకి ఓ లేఖ రాసింది.
CPP Chairperson Smt. Sonia Gandhi ji sends a strong message to 6.5 crore Kannadigas:
"The Congress will not allow anyone to pose a threat to Karnataka's reputation, sovereignty or integrity." pic.twitter.com/W6HjKYWjLa
— Congress (@INCIndia) May 6, 2023
సోనియా ఆ సభలో మాట్లాడిన విషయాన్ని ఓ ట్వీట్లో కాంగ్రెస్ పార్టీ పోస్టు చేసింది. కర్నాటక ప్రతిష్ట, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాంగ్రెస్ చూస్తుందని ఆ ట్వీట్లో తెలిపారు. అయితే సోనియా సార్వభౌమత్వం అన్న పదాన్ని వాడడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సార్వభౌమత్వాన్ని దేశం కోసం వాడుతామని, అందుకే సోనియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని బీజేపీ కోరింది.