ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఎన్నికల కోసం బీజేపీ భారీగా ఖర్చు చేసింది. 2017తో పోలిస్తే 58 శాతం మేర ఎక్కువగా ఖర్చుపెట్టింది. కమలదళంతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలకు పెద్ద మొత్తంలోనే వెచ్చించింది. ఈ మేరకు యూపీ, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఖర్చు వివరాలను ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది.