న్యూఢిల్లీ: ఒక పక్క హింసాత్మక, అమానవీయ ఘటనలతో మణిపూర్ రాష్ట్రం అల్లాడుతుంటే అదేమీ పెద్ద విషయం కాదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీలో దుమారం రేపాయి. అధికార పార్టీ ఆప్ సభ్యులు దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగించిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించారు.
వివరాల్లోకి వెళితే.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆప్ సభ్యుడు దుర్గేష్ పాఠక్ మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చను ప్రారంభించారు. దీనిపై బీజేపీకి చెందిన కరవాల్నగర్ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్ మాట్లాడుతూ మణిపూర్లో జరుగుతున్న ఘటనలు పెద్ద విషమమే కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.