BJP MLA | యూపీలోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రాజీవ్ సింగ్ (Rajiv Singh Parichha) చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న వందేభారత్ రైలు (Vande Bharat Train)లో ఓ ప్రయాణికుడిని ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు చితకబాదిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. ఎమ్మెల్యే ఎదుటే ఆయన అనుచరులు ప్రయాణికుడిపై దాడిచేశారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు సదరు ఎమ్మెల్యేకి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా షోకాజ్ నోటీసు (Showcause Notice) జారీ చేశారు. ఈ చర్య తీవ్రమైనదిగా ఆయన తెలిపారు. క్రమశిక్షణా రాహిత్యం కింద ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
बंदे भारत ट्रेन की ये वह वीडियो है जिसमे यात्री ने खिड़की वाली सीट देने से मना किया था।
bande bharat train | @JhakkasKhabar | #jhansi | pic.twitter.com/JhFwcBhkF0
— प्रतीक खरे/Pratik khare 😷 (@pratik_khare_) June 23, 2025
ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ ఇటీవలే తన భార్య, కుమారుడితో కలిసి వందేభారత్ రైలు ఎక్కారు. అయితే ఓ బోగీలో ఎమ్మెల్యే సింగ్కు ఓ చోట, తన ఫ్యామిలీకి మరో చోటు సీటు దొరికింది. కుటుంబసభ్యులు కూర్చున్న చోట వేరే ప్రయాణికుడు కూర్చుకున్నాడు. అతను సీటు మారేందుకు నిరాకరించాడు. దీంతో ఎమ్మెల్యే ఫ్యామిలీకి, ఆ వ్యక్తికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రైలు ఝాన్సీ రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆ ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతని శరీరం, దుస్తులు మొత్తం రక్తంతో నిండిపోయాయి. ఈ ఘటనపై ఝాన్సీ ఎస్పీ విపుల్ కుమార్ శ్రీవాత్సవ్ కేసు బుక్ చేసి విచారణ మొదలుపెట్టారు.
Also Read..
Operation Sindhu | 268 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న మూడో విమానం
PM Modi | మేడ్ఇన్ ఇండియా ఆయుధాలతో శత్రువును 22 నిమిషాల్లోనే మోకాళ్లపై కూర్చోబెట్టాం : ప్రధాని మోదీ
School Teacher | 24 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. పాఠశాల ఉపాధ్యాయుడు అరెస్ట్