పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బైరక్పూర్ నుంచి ఎంపీగా వున్న అర్జున్ సింగ్ బీజేపీకి గుడ్బై చెప్పేశారు. తిరిగి సొంత పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయారు. తృణమూల్ అగ్రనేత అభిషేక్ బెనర్జీ ఎంపీ అర్జున్ సింగ్కి పార్టీ కండువా కప్పి, సాదరంగా టీఎంసీలోకి ఆహ్వానించారు. కొన్ని రోజులుగా ఆయన బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తితోనే బీజేపీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. తనను పార్టీలో ఇమడనీయడం లేదని మండిపడ్డారు.
అర్జున్ సింగ్ 2001 లో టీఎంసీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన తృణమూల్ను వీడి, బీజేపీలో చేరిపోయారు. దీంతో బీజేపీ ఆయనకు బైరక్పూర్ నుంచి ఎంపీగా బరిలోకి దింపింది. సరిగ్గా మూడు సంవత్సరాల తర్వాత ఆయన బీజేపీకి రాజీనామా చేసి, తిరిగి సొంత పార్టీలో చేరారు.