రాంచీ, సెప్టెంబర్ 1: బీజేపీ బహిష్కృత నేత సీమా పాత్రాను జార్ఖండ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాంచీలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది.
ఇంటి పని కోసం తెచ్చిపెట్టుకున్న సునీత అనే ఓ గిరిజన మహిళపై సీమా పాత్రా పదేండ్లుగా చిత్రహింసలకు పాల్పడుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జార్ఖండ్ గవర్నర్ రాష్ట్ర డీజీపీని ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.