కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నిక జరిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య గురువారం ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కళ్యాణ్ చౌబే కారును ధ్వంసం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
కాగా, ఒక పాఠశాలలోని పోలింగ్ బూత్లో ఇద్దరు నకిలీ ఓటర్లను గుర్తించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని బీజేపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కళ్యాణ్ చౌబే ఆరోపించారు. దీని గురించి పోలీసులకు, కేంద్ర బలగాలకు సమాచారం అందించామని చెప్పారు. ఇంతలో ఎనిమిది నుంచి పది మంది బైకులపై వచ్చి కర్రలు, రాళ్లతో తన కారుపై దాడి చేసి ధ్వంసం చేసినట్లు మీడియాకు తెలిపారు.
#WATCH | West Bengal: A scuffle broke out between BJP and TMC supporters in Bhabanipur assembly constituency, where voting for the by-poll is underway today. BJP leader Kalyan Chaubey's car was allegedly vandalised. pic.twitter.com/TBiPFdsWlI
— ANI (@ANI) September 30, 2021