Maharastra Crisis | మహారాష్ట్ర గవర్నర్ కోశియార్తో బీజేపీ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షాలతో భేటీ అయిన తర్వాత ఫడ్నవీస్ ముంబైకి చేరుకున్నారు. ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా ఫడ్నవీస్ రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ భగత్సింగ్ కోశియారీతో భేటీ అయ్యారు. శివసేన నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్లతో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) నుంచి వైదొలగాలని.. బీజేపీతో తిరిగి జట్టు కట్టాలని ఏక్నాథ్ షిండే వర్గం డిమాండ్ చేస్తున్న తరుణంలో గవర్నర్తో ఫడ్నవీస్ సమావేశం కావడం గమనార్హం. రాజ్భవన్లో గవర్నర్ను కలిసినప్పుడు ఫడ్నవీస్ వెంబడి బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, ఆశీష్ సెలార్ ఉన్నారు.