న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఆయన భార్య గుర్ప్రీత్ కౌర్పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. హత్యాచార కేసులను పరిష్కరించేందుకు ఈ సీఎం దంపతులు రూ.5 కోట్ల వరకు లంచం వసూలు చేస్తూ ఒక దందా నడుపుతున్నారని ఆరోపించింది. గురువారం బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి మీడియాతో మాట్లాడుతూ, ‘పంజాబ్లో సీఎం మాన్ కొత్తగా వసూళ్ల దందా, అవినీతి రాకెట్ నడుపుతున్నారు. ఇందుకు సంబంధించి ఆడియో రికార్డింగ్స్, పత్రాలు ఉన్నాయి. అత్యాచార కేసులు సహా, అవినీతి కేసులు కొట్టివేయడానికి సీఎం, ఆయన భార్య మధ్యవర్తుల ద్వారా ఒక్కొక్కరు రూ.5 కోట్ల వరకు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి’ అని అన్నారు. ఒక హత్యాచార కేసులో రూ.5 కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై మాన్ భార్యకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీ చేయటం సంచలనంగా మారింది.