Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం మరోసారి విచారించనున్నారు. 2002 గుజరాత్ అల్లర సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక లైంగిక దాడి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం శిక్షను తగ్గిస్తూ విడుదల సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లపై జస్టిస్ బీవీ నాగరత్న, ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఆయా పిటిషన్లను విచారించనున్నారు. ఈ నెల 24న వాదనలు విన్న ధర్మాసనం.. ‘న్యాయవాదాన్ని ఉదాత్తమైన వృత్తిగా పరిగణిస్తారు’ అని పేర్కొన్న కోర్టు.. నేరం రుజువై.. తర్వాత శిక్షను తగ్గించినప్పటికీ దోషి న్యాయవాద వృత్తిని ఎలా చదవగలడంతూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాధేశ్యామ్ షా తరఫున న్యాయవాది రిషి మల్హోత్రా వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ శిక్షను 15 సంవత్సరాలకుపైగా అనుభవించారని, అతని ప్రవర్తనను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు.
గుజరాత్ ప్రభుత్వం 1992 నాటి క్షమాభిక్ష విధానం ఆధారంగా 11 మంది దోషులను విడుదల చేసిందని, ప్రస్తుతం అమలులో ఉన్న 2014 విధానం అనుసరించి కాదని పేర్కొన్నారు. 2014 విధానం ప్రకారం.. సీబీఐ దర్యాప్తు చేపట్టిన నేరాలకు, లైంగిక దాడులు, సామూహిక లైంగిక దాడులు, హత్యకు పాల్పడిన వ్యక్తులకు రాష్ట్రాలు మినహాయింపులు ఇవ్వకూడదు. గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానోతో పాటు సీపీఐ (ఎం) నేత సుభాషిణి అలీ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రేవతిలాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సెలర్ రూప్ రేఖావర్మ, తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాతో పాటు పలువురు పిటిషన్లు దాఖాలు చేశారు. 2022 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో వయసు 21 సంవత్సరాలు ఉండగా.. అప్పటికే ఐదునెలల గర్భిణి. గోద్రా రైలు దగ్ధం తర్వాత చెలరేగిన అల్లర్ల సమయంలో 11 మంది నిందితులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఇందులో ఆమె మూడేళ్ల కూతురు సైతం ఉన్నది.