న్యూఢిల్లీ: కర్నాటకలో ఉడిపి జిల్లాలో ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి క్లాస్రూమ్కు వెళ్లడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర విద్యార్థులు కాషాయ కండువాలను ధరిస్తూ కాలేజీలకు వెళ్లడం వివాదంగా మారింది. దీంతో కర్నాటకలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా ట్వీట్ చేశారు. బికినీ వేసుకున్నా.. గూంగట్ ధరించినా.. జీన్స్ వేసుకున్నా.. హిజబ్ ధరించినా.. తాము ఏం ధరించాలన్నది.. మహిళలకు చెందిన హక్కు అని ప్రియాంకా అన్నారు. మహిళలను వేధించడం ఆపేయాలని, నచ్చిన దుస్తుల్ని ధరించడం మహిళల హక్కు అని ఆమె స్పష్టం చేశారు. హిజబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కర్నాటకలో విద్యా సంస్థలను మూడు రోజుల పాటు బంద్ చేసిన విషయం తెలిసిందే. ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కాలేజీలో హిజబ్ వివాదం తొలుత మొదలైంది. కాలేజీ డ్రెస్ కోడ్ను ఉల్లంఘిస్తూ ఆరుగురు అమ్మాయిలు హిజబ్తో క్లాస్రూమ్కు వచ్చారు. దీంతో అక్కడ హిందూ విద్యార్థులు కండువాలతో కాలేజీకి ఎంటర్ అయ్యారు. రెండు వర్గాలుగా మారిన విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Whether it is a bikini, a ghoonghat, a pair of jeans or a hijab, it is a woman’s right to decide what she wants to wear.
This right is GUARANTEED by the Indian constitution. Stop harassing women. #ladkihoonladsaktihoon
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 9, 2022