పాట్నా: బీహార్లోని గయ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్గా పారిశుధ్య కార్మికురాలు చింతాదేవి ఎన్నికైంది. గత 40 ఏళ్లుగా మాన్యువల్ స్కావెంజర్గా పనిచేసిన ఆమె, పౌర సంస్థల ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గయ డిప్యూటీ మేయర్గా చింతాదేవిని సభ్యులు ఎన్నుకున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ కూడా ఆమెకు మద్దతు తెలిపారు.
కాగా, చింతాదేవి పారిశుధ్య పనులే గాక కూరగాయలు కూడా అమ్మి జీవనం సాగించింది. నాడు మరుగు దొడ్లు తక్కువగా ఉన్న కాలంలో మానవ మలాన్ని తట్టల్లో తలపై మోసుకెళ్లింది. అలాంటి అట్టడుగు వర్గానికి చెందిన మహిళ డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం చారిత్రాత్మకం అని గయ మేయర్గా ఎన్నికైన గణేష్ పాశ్వాన్ ప్రశంసించారు. ప్రజలు జ్ఞానోదయం కోరుకునే ప్రదేశం గయ అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు గయలో అట్టడుగు వర్గాలకు చెందిన వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి కాదు. రాళ్లు కొట్టే అట్టడుగు ముసహర్ కమ్యూనిటీకి చెందిన భగవతీ దేవి, 1996లో నితీష్ కుమార్కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) పార్టీ తరుఫున పోటీ చేశారు. గయ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.