రెండేండ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో బీహార్కు చెందిన పదేండ్ల సీమాకుమారి తన కాలుని కోల్పోయింది. అయితే, టీచర్ కావాలన్న తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే కిలోమీటర్ దూరంలో స్కూల్ ఉన్నప్పటికీ ఇలా.. ఒక్క కాలితో గెంతుతూ బడికి వెళ్తున్నది. విషయం తెలుసుకొన్న నటుడు సోనూసూద్ బాలిక కాలు చికిత్సకు సాయం అందిస్తానని ప్రకటించారు.