పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ మర్యాదపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ ఇంటికి వెళ్లారు. తేజస్వియాదవ్, రాచెల్ గొడిన్హో దంపతులకు ఇటీవల జన్మించిన ఆడబిడ్డ కాత్యాయనిని చూసేందుకు తేజస్వితో కలిసి ఆయన వారి నివాసానికి చేరుకున్నారు. కాత్యాయని చేతుల్లోకి తీసుకుని కాసేపు ముద్దుచేశారు. ఈ సందర్భంగా చిన్నారికి ఒక చిన్న బహుమతిని కూడా సీఎం బహూకరించారు.
అయితే, సీఎం తమ ఇంటికి వచ్చిన సమయంలో తీసిన ఫొటోలను తేజస్వియాదవ్ ట్విటర్లో షేర్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రిగారు ఇవాళ తమ ఇంటికి వచ్చారని, ఈ సందర్భంగా తన బిడ్డ కాత్యాయనిని ఆశీర్వదించారని పేర్కొన్నారు. తేజస్వి షేర్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా నితీశ్ కుమార్, తేజస్వియాదవ్ ఇవాళ ఉదయం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఇద్దరూ కలిసి తేజస్వియాదవ్ నివాసానికి వెళ్లారు.
अभिभावक आदरणीय मुख्यमंत्री श्री @NitishKumar जी ने सुपुत्री कात्यायनी को अपना आशीर्वाद और प्यार दिया। pic.twitter.com/GPbrCYrdBl
— Tejashwi Yadav (@yadavtejashwi) April 12, 2023