Uttarakhand Tunnel | డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ఉత్తర్కాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల వెలికితీతకు యత్నాలు జరుగుతుండగా, ఈ ప్రమాదం అనంతరం ప్రభుత్వం చేసిన ఒక ఘోర తప్పిదం బయటపడింది. ప్రమాదాలు చోటుచేసుకుంటే వాటి నుంచి తప్పించుకునేందుకు ఎస్కేప్ రూట్ను కూడా ప్లాన్లో సిద్ధం చేస్తారు.
అయితే 4.5 కి.మీ పొడవున్న ఈ సొరంగానికి కూడా అలాంటి మార్గాన్ని ప్లాన్లో రూపొందించినా దానిని చేపట్టిన కంపెనీ దానిని నిర్మించలేదు. తప్పించుకొనే మార్గం నిర్మించి ఉంటే కార్మికులకు ఈ దుస్థితి వచ్చేది కాదని బాధిత కుటుంబ సభ్యులు, పలువురు నేతలు విమర్శిస్తున్నారు.