భువనేశ్వర్: కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా షాపింగ్ మాల్స్లోని వాహనాలు నిలిపే పార్కింగ్ ప్లేస్ వద్ద టీకా కాంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా నగరంలోని ఎస్ప్లానేడ్ మాల్ పార్కింగ్ స్థలంలో డ్రైవ్-ఇన్ టీకా కేంద్రాన్ని ప్రారంభించింది. వాహనాల్లో వచ్చిన వారిలో 45 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కరోనా టీకా రెండో డోస్ ఇస్తున్నారు. దీంతో షాపింగ్ కోసం వచ్చే వారు పనిలోపనిగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.