న్యూఢిల్లీ: అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలో భారత ప్రభుత్వ నియంత్రణలోని రిఫైనరీలన్నీ ముడి చమురును వెనెజువెలా నుంచి కొనడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తొలిసారిగా వెనెజువెలా నుంచి ముడి చమురును కొనుగోలు చేయగా, ప్రైవేట్ రంగంలో హెచ్పీసీఎల్ భాగస్వామి సంస్థ అయిన హెచ్ఎంఈఎల్, స్టీల్ వ్యాపార దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ సంస్థ చమురును కొన్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ రెండు సంస్థలు ఒకే క్రూడ్ కేరియర్ ద్వారా చమురును భారత్కు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ కొత్త ఒప్పందంతో వెనెజువెలా నుంచి ఏప్రిల్ నాటికి 6 మిలియన్ బ్యారెళ్ల చమురు భారత్కు ఎగుమతి అవుతుంది.