జంషెడ్పూర్: చిరకాలంగా పెండింగ్లో ఉన్న సర్నా మతం గుర్తింపు డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 30న భారత్ బంద్ను నిర్వహించాలని ఆదివాసి సెంగెల్ అభియాన్ (ఏఎస్ఏ) గిరిజన సంఘం బుధవారం పిలుపునిచ్చింది. దేశంలోని 15 కోట్ల గిరిజన జాతికి సర్నా మతం కోడ్ గుర్తింపు ఉందని, అయితే ఈ మతాన్ని గుర్తించకపోవడం రాజ్యాంగ నేరంతో సమానమని ఏఎస్ఏ అధ్యక్షుడు సల్ఖన్ ముర్ము పేర్కొన్నారు. చిరకాలంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల సాధనకు వేరే గత్యంతరం లేక డిసెంబర్ 30 భారత్ బంద్ చేపడుతున్నామని, ఆ రోజు గిరిజనులు రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించాలని కోరారు.