న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి పరీక్షల కోసం శాంపిల్ పేపర్స్ రూపకల్పన, అమ్మకాల కోసం ప్రైవేటు ప్రచురణకర్తలతో ఎలాంటి అవగాహన కుదుర్చుకోలేదని సీబీఎస్ఈ తెలిపింది. ప్రైవేట్ ప్రచురణకర్తల ప్రకటనలను చూసి మోసపోవద్దని విద్యార్థులను హెచ్చరించింది.
ఎడ్యుకార్ట్ అనే ప్రైవేటు ప్రచురణకర్త ఇటీవల ఇస్తున్న ప్రకటనల్లో తమకు సీబీఎస్ఈతో అవగాహన ఉందని, బోర్డ్ ఎగ్జామ్స్ కోసం శాంపిల్ పేపర్స్ను అందుబాటులోకి తెచ్చామని, డబ్బు చెల్లించి, కొనుక్కోవచ్చునని వార్తలు వచ్చిన నేపథ్యంలో సీబీఎస్ఈ ఈ వివరణ ఇచ్చింది.