బెంగళూరు: బైక్ విన్యాసాలు చేస్తున్న వారిపై విసుగు చెందిన ప్రయాణికులు వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నెల 15న బెంగళూరులోని అదకమరనహళ్లి దగ్గర రద్దీగా ఉండే 48 జాతీయ రహదారిపై స్టంట్స్ చేస్తున్న బైకర్లపై ఆగ్రహం చెందిన కొందరు ప్రయాణికులు మూడు బైక్లను ఫ్లె ఓవర్ నుంచి కిందకు తోసేశారు. బైక్ విన్యాసాలపై జూన్ వరకు ట్రాఫిక్ పోలీసులు 225 కేసులను నమోదు చేశారు. ఇప్పటివరకు బైక్ విన్యాసాలు చేసిన 9 మంది డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేశారు. గత రెండేండ్లలో బైక్ విన్యాసాలపై 552 కేసులు నమోదయ్యాయి.