న్యూఢిల్లీ: సైద్ధాంతిక యుద్ధం కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఆయన స్పందించారు. ‘ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరించాం. సైద్ధాంతిక యుద్ధం కొనసాగుతుంది’ అని ఎక్స్లో పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా తెలంగాణ చేస్తామన్న హామీని తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు.
కాగా, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ విజయం సాధించింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మిజోరంలో సోమవారం ఓట్ల లెక్కింపు జరుగనున్నది.
मध्य प्रदेश, छत्तीसगढ़ और राजस्थान का जनादेश हम विनम्रतापूर्वक स्वीकार करते हैं – विचारधारा की लड़ाई जारी रहेगी।
तेलंगाना के लोगों को मेरा बहुत धन्यवाद – प्रजालु तेलंगाना बनाने का वादा हम ज़रूर पूरा करेंगे।
सभी कार्यकर्ताओं को उनकी मेहनत और समर्थन के लिए दिल से शुक्रिया।
— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2023