బెంగళూర్ : కర్నాటకలో సంఘ్ పరివార్ సభ్యులు రెచ్చిపోయారు. మంగళూర్ జిల్లాలో కొందరు యువకులు నిర్వహిస్తున్న డీజే పార్టీ ఈవెంట్లోకి చొరబడిన భజరంగ్ దళ్ సభ్యులు దాన్ని భగ్నం చేయడంతో పాటు యువకులపై దాడి చేశారు.
పార్టీలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, పోస్టర్లను చించివేసి వీరంగం సృష్టించారు. పార్టీలో వివిధ వర్గాలకు చెందిన యువతీ, యువకులు పాల్గొన్నారని భజరంగ్ దళ్ సభ్యులు ఆరోపించారు. డీజే పార్టీపై దాడి చేసిన ఆరోపణలపై ఆరుగురు భజరంగ్ దళ్ సభ్యులను మంగళూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డీజే పార్టీకి నిర్వాహకులు అనుమతి తీసుకున్నా భజరంగ్ దళ్ సభ్యులు పార్టీని భగ్నం చేశారు. అరెస్ట్ చేసిన భజరంగ్ దళ్ సభ్యులను పోలీస్ స్టేషన్లో నిర్భందించిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
KCR | మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగరాలి : కేసీఆర్
Priyanka Gandhi | రాహుల్ ఏం నేరం చేశాడు : మోదీ సర్కార్ను నిలదీసిన ప్రియాంక గాంధీ