శ్రీనగర్: జమ్మూ రైల్వే స్టేషన్ వద్ద కలకలం రేపింది. డిటోనేటర్లు, వైర్లతో కూడిన బ్యాగ్ టాక్సీ స్టాండ్లో లభించింది. ఆ బ్యాగ్లోని రెండు బాక్సుల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. 18 డిటోనేటర్లు, వైర్లతో ఉన్న ఆ బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూ రైల్వే స్టేషన్లోని టాక్సీ స్టాండ్ వద్ద అనుమానిత బ్యాగ్ని స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీకి చెందిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ఆరిఫ్ రిషు తెలిపారు. ఆ బ్యాగ్లోని రెండు బాక్లుల్లో ప్యాక్ చేసిన పేలుడు పదార్థాలు ఉన్నాయని చెప్పారు. 18 డిటోనేటర్లు, కొన్ని వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ బాక్స్లో దాదాపు 500 గ్రాముల మైనపు పదార్థం ప్యాక్ చేసి ఉందన్నారు. వీటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో జమ్మూ రైల్వే స్టేషన్ వద్ద డిటోనేటర్లతో కూడిన బ్యాగ్ లభించడం స్థానికంగా కలకలం రేపింది. ఉగ్రవాదులు ఇటీవల పౌరులను, ముఖ్యంగా కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నెల 15న షోపియాన్ జిల్లాలోని చౌదరి గుండ్లో కశ్మీరీ పండిట్ పురాణ్ క్రిషన్పై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ నెల 18న హర్మెన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ కన్నౌజ్కు చెందిన ఇద్దరు కూలీలు ఉగ్రవాదుల దాడిలో మరణించారు.