Saina Nehwal | బ్యాడ్మింటర్ స్టార్ సైనా నెహ్వాల్ శనివారం మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. ఉదయం 7:30 గంటలకు నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి పూజలు చేశారు. పూజారి సంజయ్ గురు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా మహాకాల్ ఫోటోతో పాటు తీర్థప్రసాదాలను సైనా నెహ్వాల్కు అందించి, ఆశీర్వదించారు.
మహాకాళేశ్వర్ ఆలయం సందర్శనం అనంతరం సైనా నెహ్వాల్ మీడియాతో మాట్లాడారు. తన చిన్నతనం నుంచే దేవుడిని నమ్ముతున్నానని తెలిపారు. మతపరమైన ప్రదేశాలను సందర్శించినప్పుడు, అక్కడ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసినప్పుడు తనకు చాలా ఆనందంగా ఉంటుందన్నారు. ఇవాళ తన పేరెంట్స్తో కలిసి బాబా మహాకాల్ను దర్శించుకున్నాను. చాలా సంతోషంగా ఉందన్నారు. మోకాలిలో కొద్దిగా నొప్పి ఉందని, కోలుకున్న వెంటనే బ్యాడ్మింటన్ ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ సలహా మేరకు గ్రౌండ్లోకి దిగుతానని సైనా పేర్కొన్నారు.