న్యూఢిల్లీ, జూలై 25 (నమస్తే తెలంగాణ): జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి కే మదన్మోహన్రావు వేసిన పిటిషన్పై హైకోర్టులో రోజువారీ విచారణ చేపట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న పాటిల్ విన్నపాన్ని సుప్రీం తోసిపుచ్చింది. మదన్మోహన్రావు పిటిషన్పై రోజువారీ విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయంపై పాటిల్ అప్పట్లోనే సుప్రీం ను ఆశ్రయించి స్టే పొందారు. తాజాగా సుప్రీం స్టేను తొలగించడంతో మదన్మోహన్రావు పిటిషన్పై హైకోర్టు విచారణ జరుపనున్నది. తనపై ఉన్న కేసుల గురించి పాటిల్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని మదన్మోహన్రావు తన పిటిషన్లో ఆరోపించారు.