లక్నో: గవర్నర్ పర్యటన సందర్భంగా చనిపోయిన ఉద్యోగికి డ్యూటీ వేశారు. (Assigning Duty To Dead Employee) ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక క్లర్క్ను సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 26న ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ బల్లియాను సందర్శించారు. జననాయక్ చంద్రశేఖర్ యూనివర్శిటీ ఐదవ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అయితే గవర్నర్ ఆనందీబెన్ పటేల్ బల్లియా పర్యటన సందర్భంగా చనిపోయిన ఒక ఉద్యోగికి డ్యూటీ కేటాయించారు. దీంతో గవర్నర్కు వడ్డించే ఆహారాన్ని పరీక్షించే బాధ్యత ఎవరూ చూడలేదు.
కాగా, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. బల్లియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో పనిచేస్తున్న క్లర్క్ బ్రిజేష్ కుమార్ను శనివారం సస్పెండ్ చేశారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయపతి ద్వివేది ఈ విషయం తెలిపారు. అజంగఢ్లోని అదనపు డైరెక్టర్ కార్యాలయానికి ఆయనను అటాచ్ చేసినట్లు చెప్పారు. మరోవైపు సీఎం ఆదిత్యనాథ్ కార్యాలయం కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. గవర్నర్ పర్యటన సందర్భంగా చనిపోయిన ఉద్యోగికి డ్యూటీ వేసి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించిన క్లర్క్ బ్రిజేష్ కుమార్పై దర్యాప్తు చేస్తామని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది.