దిస్పూర్: ముస్లింలలో బహు భార్యత్వానికి బీజేపీ వ్యతిరేకమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (CM Himanta Biswa Sarma) అన్నారు. స్వతంత్ర భారత దేశంలో ఉంటున్న ఒక పురుషుడు ముగ్గురు, నలుగురు మహిళలను పెళ్లి చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. అలాంటి వ్యవస్థను తాము మార్చాలనుకుంటున్నామని చెప్పారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేలా తాము మరింత కృషి చేయాల్సి ఉందన్నారు.
ప్రతిఒక్కరికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే తమ నినాదమని వెల్లడించారు. అందుకే అస్సామీ హిందూ కుటుంబాల్లో డాక్టర్లు ఉంటే.. ముస్లిం ఫ్యామిలో కూడా వైద్యులు ఉండాలని కోరుకుంటామని తెలిపారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేల అలాంటి సలహా ఇవ్వరని, ఎందుకంటే వారికి ముస్లింల ఓట్లు కావాలని విమర్శించారు.