ముంబై: ఆదిపురుష్ సినిమాపై ఆది నుంచి వివాదాలే కొనసాగుతున్నాయి. సినిమా విడుదలైన తర్వాత విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. సినిమా కథ, క్యారెక్టర్లు వాస్తవ రామాయణానికి భిన్నంగా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. ప్రత్యేకించి సినిమాకు మాటలు రాసిన మనోజ్ ముంతాషిర్పై జనం మండిపడుతున్నారు. కొంతమంది ఆయన ఎక్కడ కనిపించినా నిలదీస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే తనకు ప్రాణాపాయం ఉన్నదని, రక్షణ కల్పించాలని రచయిత మనోజ్ ముంతాషిర్ ముంబై పోలీసులను కోరారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆదిపురుష్ వివాదం గురించి ప్రశ్నించగా.. ఆ విషయం తనకేమీ తెలియదని, దర్శకుడు ఓం రౌత్నే అడగాలని పేర్కొన్నారు. ఆ సినిమాకు తాను కేవలం మాటలు, పాటలు మాత్రమే రాశానని, అంతకుమించి తన ప్రమేయం ఏమీ లేదని అన్నారు.
సినిమా కథ, పాత్రలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా దర్శకుడు ఓం రౌత్నే అడగాలని చెప్పారు. సినిమా మాటలు ఒరిజినల్ రామాయణాన్ని చెక్ చేసే రాశారా..? అని అడగ్గా.. తాను పూర్తిగా దర్శకుడు ఓం రౌత్పై నమ్మకం పెట్టుకుని రాశానని తెలిపారు.